Breaking News

గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తమ నాయకత్వంలో కీలక మార్పుల పిరోజ్ షా గోద్రెజ్ కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు

గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తమ నాయకత్వంలో కీలక మార్పులను ప్రకటించింది. ప్రస్తుత చైర్మన్ నాదిర్ గోద్రెజ్ 2026 ఆగస్టులో పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో పిరోజ్ షా గోద్రెజ్ కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 


Published on: 15 Apr 2026 11:53  IST

గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తమ నాయకత్వంలో కీలక మార్పులను ప్రకటించింది. ప్రస్తుత చైర్మన్ నాదిర్ గోద్రెజ్ 2026 ఆగస్టులో పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో పిరోజ్ షా గోద్రెజ్ కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

పిరోజ్ షా గోద్రెజ్ప్రస్తుతం చైర్‌పర్సన్-డెసిగ్నేట్గా నియమితులయ్యారు. ఆయన 2026 ఆగస్టు 14 నుండి గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ మరియు గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్‌పర్సన్‌గా పూర్తి బాధ్యతలు చేపడతారు.

ప్రస్తుత చైర్మన్ నాదిర్ గోద్రెజ్ తన 75వ ఏట, 2026 ఆగస్టు 13న పదవీ విరమణ చేస్తారు. అనంతరం ఆయన చైర్మన్ ఎమెరిటస్గా కొనసాగుతారు.నాదిర్ గోద్రెజ్ కుమారుడు బుర్జిస్ గోద్రెజ్గోద్రెజ్ ఆగ్రోవెట్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపడతారు మరియు గోద్రెజ్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరతారు.విశాల్ శర్మ ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ (Astec LifeSciences) చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

పిరోజ్ షా గోద్రెజ్, ఆది గోద్రెజ్ కుమారుడు. ఆయన ప్రస్తుతం గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ క్యాపిటల్ మరియు గోద్రెజ్ వెంచర్స్ సంస్థలకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మార్పులు సంస్థ యొక్క ప్రణాళికాబద్ధమైన వారసత్వ మార్పిడి లో భాగంగా జరుగుతున్నాయి.

 

Follow us on , &

ఇవీ చదవండి