Breaking News

కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) ముంబై చేరుకుని, తన నాలుగు రోజుల భారత పర్యటనను ప్రారంభించారు.

కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney)ఫిబ్రవరి 27, 2026న ముంబై చేరుకుని, తన నాలుగు రోజుల భారత పర్యటనను ప్రారంభించారు. 2026 ఫిబ్రవరి 28న ఆయన ముంబైలో వివిధ వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 


Published on: 28 Feb 2026 17:09  IST

కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney)ఫిబ్రవరి 27, 2026న ముంబై చేరుకుని, తన నాలుగు రోజుల భారత పర్యటనను ప్రారంభించారు. 2026 ఫిబ్రవరి 28న ఆయన ముంబైలో వివిధ వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధాని కార్నీ తన భార్య డయానా ఫాక్స్ కార్నీ మరియు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో కలిసి శుక్రవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు.

నేడు (శనివారం) ఆయన ముంబైలో స్థానిక సాంస్కృతిక ప్రదర్శనను సందర్శిస్తారు, ఇన్నోవేషన్ షోకేస్‌లో పాల్గొంటారు మరియు విశ్వవిద్యాలయ పరిశోధకులతో సమావేశమవుతారు. సాయంత్రం 'కెనడా-ఇండియా గ్రోత్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్'లో ప్రసంగిస్తారు.

భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడం మరియు వాణిజ్యం, ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), విద్యుత్ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.మార్చి 1న ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. మార్చి 2న భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

Follow us on , &

ఇవీ చదవండి