Breaking News

మధ్యప్రదేశ్‌లోని సన్వార్-ఉజ్జైన్ రహదారిపై మూడు బ్యాగుల్లో రూ. 2.83 కోట్ల విలువైన నగదు లభ్యమైంది.

మధ్యప్రదేశ్‌లోని సన్వార్-ఉజ్జైన్ రహదారిపై మే 7, 2026న మూడు బ్యాగుల్లో రూ. 2.83 కోట్ల విలువైన నగదు లభ్యమైంది. ఇండోర్ జిల్లాలోని సన్వార్-ఉజ్జైన్ హైవేపై ఉన్న భూట్టా చౌరస్తా సమీపంలో ఒక చెట్టు కింద ఈ బ్యాగులను స్థానిక రైతు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.


Published on: 08 May 2026 11:10  IST

మధ్యప్రదేశ్‌లోని సన్వార్-ఉజ్జైన్ రహదారిపై మే 7, 2026న మూడు బ్యాగుల్లో రూ. 2.83 కోట్ల విలువైన నగదు లభ్యమైంది. ఇండోర్ జిల్లాలోని సన్వార్-ఉజ్జైన్ హైవేపై ఉన్న భూట్టా చౌరస్తా సమీపంలో ఒక చెట్టు కింద ఈ బ్యాగులను స్థానిక రైతు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు ఉన్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో వాటి విలువ దాదాపు రూ. 2.83 కోట్లు ఉంటుందని తేలింది.

అయితే, ఆ నగదు కట్టలను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. ఆ కట్టల పైన, కింద మాత్రమే అసలు నోట్లు ఉండగా, మధ్యలో కేవలం రంగు కాగితాలు మరియు నకిలీ నోట్లు మాత్రమే ఉన్నాయి.మొత్తం 566 నోట్ల కట్టల్లో కేవలం 84 నోట్లు మాత్రమే అసలైనవని పోలీసులు గుర్తించారు.

ఎవరైనా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడడానికి లేదా ఎవరినైనా తప్పుదోవ పట్టించడానికి ఈ ప్లాన్ చేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి