Breaking News

వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత..


Published on: 12 Nov 2025 10:58  IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం లో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ఎదుట స్వామివారి దర్శనం కోసం ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున భక్తులు నిరీక్షించారు. ఆలయ ప్రధాన గేటుకు కూడా అధికారులు తాళం వేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన గేటు నుంచి ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డంగా రేకులు ఏర్పాటు చేశారు అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి