Breaking News

ఎక్కడి సమస్యలు అక్కడే..


Published on: 12 Nov 2025 15:19  IST

గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో పూర్తి స్థాయిలో జిల్లాకు కృష్ణా జలాలు అందాయో లేదో ఆలోచించాలని అన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే కాంట్రాక్టర్‌ను ఒక్క మాట అనరని.. ప్రాజెక్టుల పరిశీలనలో తాము వెళ్తే నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. 

Follow us on , &

ఇవీ చదవండి