Breaking News

కైలాసగిరికి కొత్త రోప్‌వే


Published on: 12 Nov 2025 17:58  IST

కైలాసగిరి రోప్‌వేకు మార్పులు చేయాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అప్పుఘర్‌ సమీపానున్న రోప్‌వేను 2004 మే 5న ప్రారంభించారు. దాని పొడవు 375 మీటర్లు. 360 డిగ్రీల కోణంలో నగర అందాలను చూస్తూ కైలాసగిరిపైకి వెళ్లేలా దీనిని రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేశారు. అప్పట్లో దీనిని బీఓటీ విధానంలో అప్పగించారు. కాలం 20 ఏళ్లు. అది పూర్తి కావడంతో రోప్‌వే ఆపేసి కొత్తది నిర్మించాలని ఇటీవల అధికారులు టెండర్లు పిలిచారు.

Follow us on , &

ఇవీ చదవండి