Breaking News

ఏపీలో రెన్యూ పవర్‌ సంస్థ భారీ పెట్టుబడులు


Published on: 14 Nov 2025 18:59  IST

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఇంధన రంగంలో రెన్యూ పవర్‌ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈడీబీతో రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఇవికాకుండా గతంలోనే రూ.22వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.తాజా ఎంవోయయూల ద్వారా 10వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి