Breaking News

విషం సరఫరా చేస్తున్నారు..


Published on: 02 Jan 2026 17:31  IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో కలుషిత నీరు తాగి 10 మంది మృతి చెందడం, పెద్ద సంఖ్యలో జనం అనారోగ్యానికి గురికావడంపై కాంగ్రెస్ అగ్రనేత అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన ఇండోర్‌లో తాగునీటి కాలుష్యం ఏమిటని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇండోర్‌లో నీరు లేదనీ, విషం మాత్రమే ఉందని నిప్పులు చెరిగారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి