Breaking News

నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక భేటీ


Published on: 03 Jan 2026 13:01  IST

ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఉదయం 10గంటలకు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. నేడు(శనివారం) కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. 

Follow us on , &

ఇవీ చదవండి