Breaking News

అమిత్ షా ఆఫీస్‌ ముందు ఆందోళన..


Published on: 09 Jan 2026 14:36  IST

కోల్‌కతాలో ఈడీ దాడులను ఖండిస్తూ టీఎంసీ ఎంపీలు ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. శుక్రవారం ఉదయం టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, శతాబ్ది రాయ్, మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్‌తో పాటు మరికొంతమంది నిరసనలు చేపట్టారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఎంపీలకు మధ్య తోపులాట జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి