Breaking News

సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం


Published on: 01 Jul 2025 16:22  IST

సిగాచీ పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు ఘటన మృతుల్లో రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు కూడా ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌రెడ్డి, ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్య రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాడ మాసం తర్వాత బంధుమిత్రులను ఆహ్వానించి పెద్దల సమక్షంలో ఘనంగా వేడుకలు జరుపుకుందని అనుకున్నారు.కానీ ఇంతలో విధి వక్రించింది. సిగాచీ ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న పేలుడు ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి