Breaking News

కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లిన కార్

మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై ఈరోజు (నవంబర్ 10, 2025) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.


Published on: 10 Nov 2025 14:52  IST

మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై ఈరోజు (నవంబర్ 10, 2025) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న ఆటోను తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న టీ కొట్టు, కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలు కాగా, ద్విచక్ర వాహనం ధ్వంసమైంది.సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి