Breaking News

దొడ్ల డైరీ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి

జనవరి 8, 2026 ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర జంక్షన్ వద్ద దొడ్ల డైరీ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి జరిగింది.


Published on: 08 Jan 2026 10:51  IST

జనవరి 8, 2026 ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర జంక్షన్ వద్ద దొడ్ల డైరీ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి జరిగింది.బాధితుడిని దొడ్ల డైరీ మేనేజర్ శ్రీనివాస్గా గుర్తించారు.మౌలా ఆలీకి చెందిన పాల వ్యాపారి కిరణ్ ఈ దాడికి పాల్పడ్డాడు.పాల వ్యాపారికి సంబంధించి పాత బకాయిలు (milk bills) పెండింగ్‌లో ఉన్నాయి. ఆ డబ్బులు చెల్లించాలని మేనేజర్ శ్రీనివాస్ అడిగిన క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.తీవ్ర ఆగ్రహానికి గురైన కిరణ్, తన వెంట తెచ్చుకున్న తల్వార్‌తో మేనేజర్ శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఘటన తర్వాత నిందితుడు కిరణ్ పరారయ్యాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి