Breaking News

థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో జరిగిన ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్ సంగీత ఉత్సవంలో పాల్గొన్న భారతీయుడి మృతి

థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో జరిగిన ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్ (EDC) సంగీత ఉత్సవంలో పాల్గొన్న ఒక భారతీయ పర్యాటకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.


Published on: 20 Jan 2026 12:15  IST

థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో జరిగిన ఎలక్ట్రిక్ డైసీ కార్నివాల్ (EDC) సంగీత ఉత్సవంలో పాల్గొన్న ఒక భారతీయ పర్యాటకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.మృతుడిని 28 ఏళ్ల జైసాక్షమ్ గా గుర్తించారు.పుకెట్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన ఆయన, జనవరి 18 (ఆదివారం) తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత జైసాక్షమ్ వింతగా ప్రవర్తిస్తూ రోడ్డుపై ఉన్న వస్తువులను, పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం ఆయన స్పృహ కోల్పోయారు.రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆయనను థలాంగ్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.

జైసాక్షమ్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని ప్రాథమిక పరీక్షలో తేలింది. మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాచిరా పుకెట్ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి