Breaking News

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 3, 2026న పాక్ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ ఆరోపణలు చేశారు.


Published on: 03 Mar 2026 12:58  IST

భారత్ ఇంకాకొక యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 3, 2026న పాక్ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ ఆరోపణలు చేశారు. భారత నాయకులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు బహిరంగంగా మాట్లాడుతున్నారని, అయితే ప్రాంతీయ శాంతి దృష్ట్యా తాను యుద్ధాన్ని సిఫార్సు చేయనని ఆయన అన్నారు.

సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) భారత్ నిలిపివేయడాన్ని ఆయన "జల ఉగ్రవాదం"గా అభివర్ణించారు.యుద్ధ రంగం నుండి తప్పుకుని, అర్థవంతమైన చర్చల టేబుల్ వద్దకు రావాలని భారత్‌ను కోరారు.

కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు దక్షిణాసియాలో శాంతి కష్టమని పునరుద్ఘాటించారు.రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో భారత్ అగ్ని-II క్షిపణులను మోహరించిందని పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ వ్యాఖ్యలను భారత వర్గాలు కొట్టిపారేశాయి. పాకిస్థాన్ తన అంతర్గత సంక్షోభాల నుండి దృష్టి మరల్చడానికి ఇలాంటి రాజకీయ ప్రకటనలు చేస్తోందని, ఇది కేవలం "డిఫెన్సివ్ పోస్చరింగ్" మాత్రమేనని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 

 

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement