Breaking News

అమెరికాలోని టెక్సాస్ నుంచి భారీ స్థాయిలో వంటగ్యాస్ (LPG) తీసుకుని వచ్చిన 'పైక్సిస్ పయనీర్' నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు, అమెరికాలోని టెక్సాస్ నుంచి భారీ స్థాయిలో వంటగ్యాస్ (LPG) తీసుకుని వచ్చిన 'పైక్సిస్ పయనీర్' (Pyxis Pioneer) అనే నౌక 2026, మార్చి 22 ఆదివారం ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది.


Published on: 23 Mar 2026 11:13  IST

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు, అమెరికాలోని టెక్సాస్ నుంచి భారీ స్థాయిలో వంటగ్యాస్ (LPG) తీసుకుని వచ్చిన 'పైక్సిస్ పయనీర్' (Pyxis Pioneer) అనే నౌక 2026, మార్చి 22 ఆదివారం ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. 

పైక్సిస్ పయనీర్ (Pyxis Pioneer), ఇది సింగపూర్ జెండాతో ప్రయాణిస్తోంది.ఈ నౌక అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న 'నెదర్‌ల్యాండ్' పోర్టు నుండి ఫిబ్రవరి 14న బయలుదేరింది.ఈ నౌక మొత్తం 46,961 టన్నుల ఎల్‌పీజీని మోసుకొచ్చింది, అందులో 16,714 మెట్రిక్ టన్నులను మంగళూరు పోర్టులో అన్‌లోడ్ చేయనున్నారు. మిగిలిన సరుకును గుజరాత్‌లోని కాండ్లా పోర్టులో, ముంబైలో దిగుమతి చేస్తారు.

మంగళూరులో సముద్ర మట్టానికి 225 మీటర్ల దిగువన నిర్మించిన భారతదేశపు అతిపెద్ద భూగర్భ ఎల్‌పీజీ నిల్వ కేంద్రంలో (80,000 టన్నుల సామర్థ్యం) ఈ గ్యాస్‌ను నిల్వ చేస్తారు.చమురు, గ్యాస్ దిగుమతులను ప్రోత్సహించేందుకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుండి మార్చి 31 వరకు మంగళూరు పోర్టులో కార్గో ఛార్జీలను పూర్తిగా రద్దు చేసింది. అదేవిధంగా, రష్యా నుండి 96,099 టన్నుల ముడి చమురుతో వచ్చిన 'ఆక్వా టైటాన్' (Aqua Titan) అనే నౌక కూడా మార్చి 21న మంగళూరుకు చేరుకుంది. ఈ భారీ దిగుమతుల వల్ల దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వంటగ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగదని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి