Breaking News

మున్సిపల్ కార్యాలయంలో కుంగినభూమి

మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో 24 జూన్ 2026, బుధవారం ఉదయం భూమి కుంగిపోయింది.మందమర్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ భవనంలో గల అకౌంట్ సెక్షన్ గది. బుధవారం ఉదయం దాదాపు 7:00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


Published on: 24 Jun 2026 15:37  IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో 24 జూన్ 2026, బుధవారం ఉదయం భూమి కుంగిపోయింది.మందమర్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ భవనంలో గల అకౌంట్ సెక్షన్ గది. బుధవారం ఉదయం దాదాపు 7:00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.గదిలోని భూమి ఒక్కసారిగా ఒక ఫీటు లోతుకు కుంగిపోవడంతో అక్కడున్న ఫర్నిచర్, రికార్డులు, ఇతర ప్రభుత్వ సామాగ్రి అంతా చిందరవందరగా పడిపోయాయి.

తెల్లవారుజామున ఘటన జరగడం, ఆ సమయంలో కార్యాలయంలో సిబ్బంది కానీ, ప్రజలు కానీ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.భవన నిర్మాణ సమయంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలా భూమి కుంగిపోయిందని స్థానికులు, పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి