Breaking News

సర్పంచ్ వేధింపులు.. ప్రాణహానీ అంటూ మహిళ ఫిర్యాదు


Published on: 26 May 2025 16:33  IST

ఓ మహిళ పట్ల వైసీపీకి చెందిన సర్పంచ్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామ సర్పంచ్ గుడిపూడి రఘు గత కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ ఆరోపించింది. సర్పంచ్ రఘుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సర్పంచ్ విషయంలో తనకు న్యాయం చేయకపోతే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ సదరు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తనకు న్యాయం జరిగేలా చూడాలని మహిళ కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి