Breaking News

హత్య చేసి నేరుగా పోలీసు స్టేషన్‌కి వచ్చిన యువకుడు


Published on: 27 May 2025 18:51  IST

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి వద్ద బోల్లు మల్లవ్వ(60) అనే వృద్ధురాలిని ఓ యువకుడు అతి దారుణంగా కొబ్బరి బొండాల కత్తి నరికి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రి తరలించారు. భూ వివాదాల కారణంగా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Follow us on , &

ఇవీ చదవండి