Breaking News

సబ్జెక్టు పునఃమూల్యాంకనంలో 96 మార్కులు..!


Published on: 28 May 2025 12:34  IST

బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివిన తేజస్వినికి, ఇటీవల విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు వచ్చాయి. అయితే సోషల్‌ సబ్జెక్టులో కేవలం 23 మార్కులు వచ్చాయని పేర్కొనడంతో ఫెయిల్‌గా ప్రకటించారు. పునఃమూల్యాంకనంలో ఆశ్చర్యకరంగా ఆమెకు 96 మార్కులు రావడంతో మొత్తం స్కోరు 575కి చేరింది. ఈ లోపే ట్రిపుల్‌ ఐటీకి దరఖాస్తు గడువు ముగిసిపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి