Breaking News

‘గుట్ట’ దేవస్థానంలో చింతపండు దొంగలు


Published on: 29 May 2025 12:51  IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రసాదాల తయారీకేంద్రంలో చింతపండు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు.. మంగళవారం అర్ధరాత్రి సంచులను కారులో తరలించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన పార్వతి మధు, రాజాపేట మండలం బేగంపేటకు చెందిన చెడదీప్‌ గణేశ్‌లు యాదగిరిగుట్ట దేవస్థానంలో సురక్ష అనే ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఏడాదిగా పనిచేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి