Breaking News

పేలవంగా వైసీపీ నిరసనలు


Published on: 05 Jun 2025 10:51  IST

రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్‌ 4వ తేదీని ‘వెన్నుపోటు దినం’ పేరుతో బుధవారం వైసీపీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే.. ఈ నిరసన పేలవంగా సాగింది. పార్టీ అధిష్ఠానం పదే పదే చెప్పినా చాలా జిల్లాల్లో కీలక నాయకులు లైట్‌ తీసుకున్నారు. ఇక, సాధారణ ప్రజానీకం అసలు పట్టించుకోలేదు. మరోవైపు.. వైసీపీ నాయకులు కొందరు పోలీసులపైనా, ప్రజలపైనా తమ ప్రతాపం చూపించారు.

Follow us on , &

ఇవీ చదవండి