Breaking News

ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్


Published on: 13 Jun 2025 11:13  IST

గురువారం (జూన్ 12) మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రయాణీకుల విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 కుప్ప కూలిపోయింది. విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందించింది. బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని టాటా సన్స్‌ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామన్నారు. దాంతో పాటు బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి