Breaking News

ట్రంప్ మాటలు సరికాదు.. అప్పుడు మోదీతో నేనూ ఉన్నాను


Published on: 01 Jul 2025 15:24  IST

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తాను ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసుకుంటున్న ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) తోసిపుచ్చారు. అందులో వాస్తవం లేదన్నారు. న్యూయార్క్‌లోని 'న్యూస్‌వీక్‌'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోనులో ప్రధాని మోదీతో మాట్లాడేటప్పుడు తాను అక్కడే ఉన్నానని, భారత్‌కు సంబంధించినంత వరకూ ట్రేడ్‌కూ, కాల్పుల విరమణకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి