Breaking News

క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు కేంద్రం గుడ్‌ న్యూస్‌


Published on: 02 Jul 2025 11:51  IST

ఉబర్, ఓలా  వంటి ఆన్‌లైన్‌ క్యాబ్‌ సర్వీసుల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. క్యాబ్‌ అగ్రిగేటర్లు రద్దీ సమయాల్లో బేస్‌ ఛార్జీ కంటే రెండు రెట్ల వరకు ధరను పెంచుకోవచ్చు. అలాగే విపరీతమైన రద్దీ ఉంటే సర్‌ ఛార్జ్‌ను 200 శాతం పెంచుకునే వీలు కల్పించింది. అయితే, మూడు కిలోమీటర్లలోపు ప్రయాణించే వారికి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని షరతు పెటింది.

Follow us on , &

ఇవీ చదవండి