Breaking News

పలాస టు మహారాష్ట్ర.. వయా హైదరాబాద్‌


Published on: 29 Apr 2025 10:01  IST

ఒడిశాలో కొనుగోలు చేసి.. పలాస నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్‌(Hyderabad) మీదుగా రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్స్‌ను అరెస్టు చేసి వారి నుంచి 410 కిలోల గంజాయి, మినీ వ్యాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సరుకు విలువ రూ. 2.5కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నాంపలిల్లోని ఆబ్కారీ భవన్‌లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి