Breaking News

ప్రధాని పర్యటనకు 90 శాతం ఏర్పాట్లు పూర్తి


Published on: 29 Apr 2025 14:43  IST

ప్రధాని మోదీ  అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన పనులను రేపటికి పూర్తిచేస్తామని చెప్పారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 365 కి.మీ ట్రంక్ రోడ్లు, 1500 కి.మీ లే ఔట్ రోడ్లు నిర్మించేలా ప్లాన్ ఉంది అని నారాయణ తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి