Breaking News

రేవంత్‌ సర్కారు మరో రూ.1400 కోట్ల అప్పు


Published on: 30 Apr 2025 11:12  IST

రేవంత్‌రెడ్డి సర్కారు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,400 కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 27 ఏండ్లకాల పరిమితితో 6.79 శాతం వార్షిక వడ్డీకి రూ.700 కోట్లు తీసుకున్నది. మరో రూ.700 కోట్లను 31 ఏండ్లకాల పరిమితితో 6.79 శాతం వార్షిక వడ్డీకి సేకరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

Follow us on , &

ఇవీ చదవండి