Breaking News

‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..


Published on: 04 Nov 2025 14:46  IST

వందే భారత్‌ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు. పురంలో వందే భారత్‌ రైలును ఆపేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు.రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు. బళ్లారి నుంచి మడకశిర మీదుగా రైల్వే ట్రాక్‌ పనులు వేగంగా సాగుతాయని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి