Breaking News

వైసీపీకి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్


Published on: 05 May 2025 15:02  IST

రాయలసీమ గడ్డ తన అడ్డా అని వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలను బాలకృష్ణ హెచ్చరించారు. ఇవాళ(సోమవారం) హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి