Breaking News

నేడు డాక్‌యార్డ్‌ వంతెన ప్రారంభం


Published on: 12 Nov 2025 17:55  IST

పారిశ్రామిక ప్రాంతవాసుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. వంతెన నిర్మాణం నిమిత్తం సుమారు 15 నెలల పాటు మూసివేసిన మార్గం తెరచుకోనుంది. బుధవారం ఉదయం నుంచి వంతెనపై రాకపోకలకు అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. భారీ వాహనాలు మినహా, మిగిలిన అన్నిరకాల వాహనాలను అనుమతించనున్నారు. పునర్నిర్మాణం నిమిత్తం 2024 ఆగస్టు 1 నుంచి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంతెనను మూసివేశారు. తొమ్మిది నెలల్లో వంతెన నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో ఆలస్యమయింది.

Follow us on , &

ఇవీ చదవండి