Breaking News

రోహిత్‌ బాటలోనే విరాట్ కోహ్లీ.. టెస్టులకు వీడ్కోలు?


Published on: 10 May 2025 11:22  IST

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ  కూడా టెస్టులకు రిటైర్‌మెంట్ తీసుకుంటాడా? అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అతడి బాటలోనే కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. జూన్‌ నుంచి ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లనుంది. ఆలోగానే టెస్టు భవితవ్యంపై కోహ్లీ ప్రకటన చేస్తాడని సమాచారం. 

Follow us on , &

ఇవీ చదవండి