Breaking News

సీబీఐ వలలో ఆదాయపన్ను శాఖ కమిషనర్‌


Published on: 11 May 2025 11:03  IST

లంచం కేసులో సీబీఐకి పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్‌ ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ జీవన్‌లాల్‌ లావుడ్యా, లంచం కేసులో అరెస్టయ్యారు. రూ.70 లక్షల లంచం తీసుకుంటూ మధ్యవర్తి పట్టుబడిన ఘటనతో, జీవన్‌లాల్‌తో పాటు మరికొందరు కూడా అరెస్టయ్యారు. CBI మొత్తం 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.69 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఫిర్యాదు ఆధారంగా 14 మంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి