Breaking News

యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు..


Published on: 31 Dec 2025 14:43  IST

యూట్యూబర్ అన్వేష్‌పై (YouTuber Anvesh) కేసు నమోదు అయ్యింది. దేవీ దేవతలను దూషించారంటూ అన్వేష్‌పై సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 352,79,299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్‌కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్‌పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి