Breaking News

పాక్ బ్రతకాలంటే.. ఉగ్రవాదాన్ని నియంత్రించాలి


Published on: 13 May 2025 11:40  IST

పహల్గాం ఉగ్రదాడి అనంతరం.. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అలాంటి వేళ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి సోమవారం రాత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా చర్యలకు పాల్పడితే ఉపేక్షించ బోమంటూ పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి