Breaking News

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో మధ్యాహ్నం భారీ వర్షాల కారణంగా ఒక రోడ్డు పక్కన ఉన్న రావి చెట్టు ఒక్కసారిగా స్కూల్ బస్సుపై విరిగిపడటంతో 11 ఏళ్ల విద్యార్థి మృతి

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 30 జూన్‌ 2026 మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షాల కారణంగా ఒక రోడ్డు పక్కన ఉన్న రావి చెట్టు ఒక్కసారిగా స్కూల్ బస్సుపై విరిగిపడటంతో 11 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు.


Published on: 30 Jun 2026 19:55  IST

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 30 జూన్‌ 2026 మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షాల కారణంగా ఒక రోడ్డు పక్కన ఉన్న రావి చెట్టు ఒక్కసారిగా స్కూల్ బస్సుపై విరిగిపడటంతో 11 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.

మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:50 గంటలకు చెంబూర్‌లోని రోడ్ నంబర్ 11, హెరిటేజ్ ప్రైడ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.తిలక్ నగర్‌లోని 'యూనివర్సల్ హైస్కూల్'కు చెందిన విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సుపై ఈ భారీ వృక్షం కూలిపడింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విహాన్ శ్రీవాస్తవ (11) అనే విద్యార్థిని వెంటనే జెన్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

రెస్క్యూ ఆపరేషన్

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 18 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు కండక్టర్, స్థానిక పౌరులు వెంటనే స్పందించి 12 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు.సమాచారం అందుకున్న ముంబై ఫైర్ బ్రಿಗేడ్, పోలీస్, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, క్రెయిన్ల సహాయంతో చెట్టును తొలగించి మిగిలిన పిల్లలను రక్షించారు.గాయపడిన మరో నలుగురు విద్యార్థులను చెంబూర్‌లోని జెన్ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న చెట్లను కత్తిరించాలని స్థానికులు గతంలోనే మున్సిపల్ అధికారులకు (BMC) పలుమార్లు ఫిర్యాదు చేసినా, వారు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement