Breaking News

ఉప్పల్ స్టేడియంలో సీఐడీ సోదాలు


Published on: 18 Jul 2025 15:30  IST

హెచ్‌సీఏ స్కామ్ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉప్పల్ స్టేడియంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. హెచ్‌సీఏ అక్రమాల కేసులో నిందితుల సీన్ రీ కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం ఏ1 నిందితుడు జగన్ మోహన్ రావును ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లారు సీఐడీ అధికారులు. ఉప్పల్ స్టేడియంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆపై ఉప్పల్ స్టేడియం నుంచి శ్రీ చక్ర క్లబ్‌కు నిందితులను తరలించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి