Breaking News

స్పీకర్‌ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌


Published on: 10 Nov 2025 19:11  IST

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఆలస్యం జరిగిందని ఆరోస్తూ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన అక్టోబర్‌ 31 గడువు ముగిసినా నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై సీజేఐ బీఆర్‌ గవాయి వ్యాఖ్యానిస్తూ, “కోర్టు నవంబర్‌ 24తో ముగిసినట్లు కాదు” అని స్పష్టం చేశారు. కేసు విచారణను వచ్చే సోమవారం కొనసాగించనున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి