Breaking News

రేషన్‌ కోసం.. గంటల కొద్దీ క్యూలు


Published on: 03 Jun 2025 14:16  IST

నగరవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ముందు చేంతాడంత క్యూలు కనబడుతున్నాయి. మూడు నెలల రేషన్‌ సరుకులు ఒకేసారి పంపిణీ చేసే విధానంలో మొదటి రోజు కార్డు దారులు, రేషన్‌ డీలర్లు నానా ఇబ్బందులు పడ్డారు. రెండో రోజు కూడా నగరంలో అదే పరిస్థితి నెలకొంది. ఒక్కో ఆహార భద్రత కార్డులో ప్రతి సభ్యునికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసే 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లభించే కిలో బియ్యం వేరు వేరుగా తూకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow us on , &

ఇవీ చదవండి