Breaking News

ప్రశాంత్ కిషోర్‌పై పరువునష్టం కేసు


Published on: 03 Jun 2025 18:28  IST

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ లీగల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై బీహార్ మంత్రి, జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరి మంగళవారంనాడు పరువునష్టం కేసు వేశారు. అశోక్ చౌదరి తన కుమార్తెకు లోక్‌సభ సీటు సంపాదించేందుకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు డబ్బులు ఇచ్చారంటూ ప్రశాంత్ కిషోర్ ఆరోపించినట్టు తెలుస్తోంది. దీనిపైనే చౌదరి పరువునష్టం కేసు వేశారు. చౌదరి కుమార్తె శాంభవి లోక్‌ జనశక్తి పార్టీ సమస్టిపూర్ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి