Breaking News

ఫ్లైవోవర్‌ పైనుంచి పడిన మామిడి కాయల వ్యాన్‌..


Published on: 18 Jun 2025 16:30  IST

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆగ్రా పోలీస్‌స్టేషన్‌ ఏరియాలో మామిడి కాయల లోడుతో వచ్చిన ఓ వ్యాన్‌ అదుపుతప్పి ఫ్లైవోవర్‌ పైనుంచి దూసుకెళ్లి కింద మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న వాళ్లపై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద మృతుల్లో ముగ్గురు మార్నింగ్‌ వాకర్స్‌ కాగా, ఒకరు వ్యాన్‌ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి