Breaking News

మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కిన గౌరవం


Published on: 20 Jun 2025 14:13  IST

పద్మశ్రీ అవార్డును తాను అందుకున్నప్పటికీ అది యావత్‌ మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కినదిగా తాను భావిస్తానని పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు. నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌ సెంటర్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం మంద కృష్ణమాదిగకు సన్మాన సభను నిర్వహించారు.వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంద కృష్ణమాదిగతో పాటు ఆయన సతీమణి జ్యోతిని ఘనంగా సన్మానించారు.

Follow us on , &

ఇవీ చదవండి