Breaking News

రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్


Published on: 24 Jun 2025 11:00  IST

రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన విజయవాడ వైసీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కుమారుడు లక్ష్మీ విజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్కీంల పేరుతో 22 రకాల ప్రాజెక్టుల పేర్లు చెప్పి కోట్ల రూపాయలు వరకు ఏపీ ఇన్ ఫ్రాకన్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేశాడు విజయ్. అయితే పెట్టుబడి పెట్టిన వారికి ప్లాట్లు ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డాడు.బాధితుల ఫిర్యాదుతో విజయ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

Follow us on , &

ఇవీ చదవండి