Breaking News

భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రి ‘ఎక్స్‌’ ఖాతా నిలిపివేత


Published on: 29 Apr 2025 15:09  IST

పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్‌ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోంది. పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌,యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పాక్‌ రక్షణ మంత్రి ఖాతాను బ్లాక్‌ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి