Breaking News

తీవ్ర తుఫానుగా మారనున్న.. మొంథా


Published on: 27 Oct 2025 10:20  IST

ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం ఆదివారం రాత్రికి ఇది తుఫానుగా మారినట్టు అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ జేటీడబ్ల్యూసీ(జాయింట్‌ టైఫూన్‌ వార్నింగ్‌ సెంటర్‌) ప్రకటించింది. అయితే, భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ఈ తుఫానుకు థాయ్‌లాండ్‌ దేశం సూచించిన ‘మొంథా’ అని పేరు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి