Breaking News

ఆలయంలో అత్యంత విషాదం..


Published on: 01 Nov 2025 13:56  IST

కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్ లోనే తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి