Breaking News

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీపై డీసీపీ రియాక్షన్..


Published on: 04 Nov 2025 14:54  IST

గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మాదాపూర్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాదాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు ఎస్ఎం కో లివింగ్ హాస్టల్లో రైడ్ నిర్వహించారని తెలిపారు. తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి వద్ద డ్రగ్స్ లభించాయని చెప్పారు.వారిని అదుపులోకి తీసుకున్నామని.మొత్తం ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి