Breaking News

చేవెళ్ల ప్రమాదం..సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ


Published on: 04 Nov 2025 16:46  IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. మీడియా ఛానల్స్, పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ చర్యలు తీసుకుంది. ఈ సంఘటనపై డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీలకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి