Breaking News

పాక్‌ అడ్డదారులు.. భారత్‌ హైఅలర్ట్‌


Published on: 05 May 2025 10:01  IST

పహల్గాం దాడి తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ నుంచి వచ్చే దిగుమతులు అన్నింటిపై భారత్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ఉత్పత్తులను ఎలాగైనా మన మార్కెట్లోకి పంపించేందుకు దాయాది అడ్డదారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. యూఏఈ, సింగపూర్‌, ఇండోనేసియా, శ్రీలంక మీదుగా వాటిని భారత్‌లోకి పంపించాలని వ్యూహాలు పన్నుతోంది. దీంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 

Follow us on , &

ఇవీ చదవండి