Breaking News

అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్..


Published on: 05 Nov 2025 14:38  IST

మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పరామర్శ పేరుతో వారిపైనే జగన్ దండయాత్రలాగా వెళ్లారంటూ మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతోనే ప్రధాన మార్గంలో వెళ్లారని ఆరోపించారు.సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే అర్హత, స్థాయి జగన్‌కు ఉందా అని మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి